జీతం జాతకాలు చెప్పబడును !
అది పవిత్రమైన కృష్ణా, గోదావరీ నదుల పరీవాహ ప్రాంతం, సారవంతమైన భూమి, పాడి పంటలతో..అలరారుతూ, ఆదినుంచి దేశానికి అన్నపూర్ణగా విలసిల్లిన ఆంధ్రప్రదేశ్. జై ఆంధ్రా ఉద్యమంతో మద్రాసు నుండి విడివడి, తెలంగాణతో జతకట్టి, కళకళలాడిన ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రం.
ముందుచూపు లేని అప్పటి పాలకుల ఫాల్తు నిర్ణయంతో, హైదరాబాద్ ని రాష్ట్ర రాజధానిగా ఎన్నుకొని, అక్కడే అభివృద్ధి అంతా కేంద్రీకరించి, వాళ్ళ పరిశ్రమలూ, వ్యాపారాలు, ఆస్తులూ పెంచుకునే యావలో, అటు తెలంగాణాని, ఇటు ఆంధ్రా అభివృద్ధిని కూడా గాలికొదిలేసి, పరోక్షంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ఊపిరి పోసి, చివరికి ఎటువంటి ప్రత్యేక హోదా, వనరులు, సహాయం లేకుండా.. కట్టుబట్టల్తో విడగొట్టబడిన రాష్ట్రం నేటి ఆంధ్ర ప్రదేశ్.
బొమ్మ చాలా బాగుంది . అభినందనలు